జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.116 కోట్లు

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (18:07 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లోని శ్రీవారి హుండీ ఆదాయం జూన్ నెలలో రూ.100 కోట్లు దాటేసింది. జూన్ నెలలో స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 23 లక్షలుగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే, గత నెలలో 1.06 కోట్ల మేరకు శ్రీవారి లడ్డూలను విక్రయించినట్టు వెల్లడించారు. గత నెలలో స్వామివారి హుండీ ద్వారా రూ.116.14 కోట్ల మేరకు ఆదాయం వచ్చినట్టు తెలిపింది. 
 
మొత్తం 23 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా, 10.8 లక్షల మంది భక్తులు తలనీనాలు సమర్పించారు. 24.38 లక్షల మంది భక్తులు తిరుమల కొండపై అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు టీటీడీ 1.06 కోట్ల లడ్డూలను విక్రయించింది. 
 
కాగా, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శనివారం స్వామివారిని 871,71 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అత్యంత విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోగ్యం...

వైకాపా లీగల్ సెల్ న్యాయవాది బాగోతం.. మహిళలతో అసభ్య నృత్యాలు..

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? పీటీఐ నేత ఏమంటున్నారు...

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట

28-11-2025 శుక్రవారం ఫలితాలు - లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం...

27-11-2025 గురువారం ఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

Cow Worship: ఈ పరిహారం చేస్తే చాలు.. జీవితంలో ఇక అప్పులే వుండవట..

టీటీడీకి మరో గొప్ప విరాళం.. రూ.9కోట్లు ఇచ్చిన అమెరికా భక్తుడు

తర్వాతి కథనం
Show comments