రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. వరుసగా 35 మాసాలు వంద కోట్ల మార్క్

సెల్వి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (11:59 IST)
తిరుపతి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల, కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం. ఈ ఆలయానికి, ప్రపంచంలోని వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని భారీ సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలు వేచి వుంటారు. స్వామి వారి దర్శనం కోసం ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, భక్తుల ఆకలి తీర్చేందుకు ఉచిత భోజనం వంటి వసతులు వున్నాయి. 
 
అలాగే శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ మొక్కులు తీరాక ఆలయంలోని హుండీలో భారీగా కానుకలు, డబ్బు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభం జనవరి నెలలో 20.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా 106 కోట్ల 17 లక్షల రూపాయలు శ్రీవారికి హుండీ ఆదాయంగా వచ్చింది. ఈ ఆదాయంతో ఆలయ చరిత్రలోనే శ్రీవారి హుండీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది. తద్వారా వరుసగా వంద కోట్లకు పైగా హుండీ ఆదాయం సంపాదించిన 35వ మాసంగా జనవరి నిలిచింది. మార్చి 2022 నుంచి వరుసగా వందకోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటుతుందని టీటీడీ వెల్లడించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

ఏపీలో ప్రతి 50 కిమీకి ఒక పోర్టు నిర్మాణం : సీఎం చంద్రబాబు

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కేవలం 47 శాతం పోలింగ్ మాత్రమే నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

సంకష్టహర చతుర్థి రోజున సంకష్ట నాశన గణేశ స్తోత్రాన్ని పఠిస్తే..?

Sankatahara Chaturthi: శనివారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే శనిదోషాలు పరార్

07-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య పరిష్కారం అవుతుంది..

తర్వాతి కథనం
Show comments