Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వ దర్శనానికి మోక్షమెప్పుడో... గత 79 రోజులుగా దర్శనభాగ్యం కరువాయే..

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (11:16 IST)
కలియుగ వైకుంఠుడై శ్రీవేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులు దర్శనం చేసుకునే వెసులుబాటు ఎప్పటికి లభిస్తుందోనన్న బెంగ చాలా మంది భక్తుల్లో నెలకొంది. కరోనా వైరస్, కరోనా లాక్డౌన్ కారణంగా గత 79 రోజులుగా సర్వదర్శనాన్ని నిలిపివేశారు. 
 
కరోనా రెండో దశ విజృంభణ కారణంగా ఏప్రిల్ 12 నుంచి సర్వదర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ఇప్పటివరకు వాటిని పునరుద్ధరించకపోవడంతో పేదలు, సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
 
మరోవైపు, ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ తగ్గించింది. మే నెలలో రోజుకు 15 వేల టికెట్లను మాత్రమే జారీ చేసింది. టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ కరోనా వైరస్ భయంతో చాలా మంది తిరుమల రాలేకపోయారు. దీంతో జూన్ నెలలో రోజుకు ఐదు వేల టికెట్లను మాత్రమే జారీ చేసింది. 
 
జులైలోనూ అదే సంఖ్యలో టికెట్లను జారీ చేస్తోంది. ఫలితంగా నేరుగా తిరుమల వచ్చే భక్తులు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు పొందేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి 79 రోజులుగా సర్వదర్శనం నిలిచిపోవడంతో టికెట్ల కోటాను పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments