తిరుమల శ్రీవారి దర్శనం 35 నిమిషాల్లోనే...

Webdunia
బుధవారం, 30 మార్చి 2016 (09:59 IST)
కలియుగ వైకుంఠం తిరుమల గిరుల్లో భక్తులే కనిపించడం లేదు. పరీక్షా సమయం కావడంతో భక్తులెవరు తిరుమలకు రావడం లేదు. దీంతో తిరుమల గిరులు బోసిపోయి కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. టిటిడి అధికారులు హడావిడిగా వాహనాల్లో తిరుగుతున్నారేగానీ, భక్తుల తాకిడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 
 
సర్వదర్శనంకు వెళ్ళే భక్తులతో పాటు కాలినడకన వెళ్ళే భక్తులు నేరుగా కంపార్టుమెంట్ల నుంచి దర్శనానికి వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ లైన్‌గా ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతోంది. సర్వదర్శనం, కాలినడక భక్తులకు 35 నిమిషాల్లోనే స్వామివారి దర్శన భాగ్యం లభిస్తోంది. మంగళవారం శ్రీవారిని 45,961 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం, కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో కనిపించలేదు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం 3కోట్ల ఒక లక్ష రూపాయలు వచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

Show comments