Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సాధారణ స్థాయిలో భక్తులు... శ్రీవారి సేవలో 'సుప్రీమ్' టీం సభ్యులు

Webdunia
శనివారం, 7 మే 2016 (12:06 IST)
వారాంతం కావస్తున్నా తిరుమలలో రద్దీ మాత్రం సాధారణంగానే ఉంది. సాధారణంగా ప్రతి శనివారం తిరుమలలో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ ఉంటుంది. కానీ, ఈ శనివారం మాత్రం రద్దీ తక్కువగా ఉంది. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి నాలుగు గంటలు దర్శన సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టమెంట్లో వేచి ఉండగా వారికి దర్శనం 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 70,969 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.17 లక్షలుగా వసూలైంది.
 
అలాగే, తిరుమల శ్రీవారిని "సుప్రీమ్" సినీ యూనిట్‌ దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌‌తో పాటు హీరోయిన్‌ రాశీఖన్నా, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌ రాజు చిత్ర యూనిట్‌ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో సినీ యూనిట్‌ సభ్యులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సినీ ప్రముఖలను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments