తిరుమలలో సాధారణ స్థాయిలో భక్తులు... శ్రీవారి సేవలో 'సుప్రీమ్' టీం సభ్యులు

Webdunia
శనివారం, 7 మే 2016 (12:06 IST)
వారాంతం కావస్తున్నా తిరుమలలో రద్దీ మాత్రం సాధారణంగానే ఉంది. సాధారణంగా ప్రతి శనివారం తిరుమలలో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ ఉంటుంది. కానీ, ఈ శనివారం మాత్రం రద్దీ తక్కువగా ఉంది. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి నాలుగు గంటలు దర్శన సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టమెంట్లో వేచి ఉండగా వారికి దర్శనం 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 70,969 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.17 లక్షలుగా వసూలైంది.
 
అలాగే, తిరుమల శ్రీవారిని "సుప్రీమ్" సినీ యూనిట్‌ దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌‌తో పాటు హీరోయిన్‌ రాశీఖన్నా, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌ రాజు చిత్ర యూనిట్‌ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో సినీ యూనిట్‌ సభ్యులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సినీ ప్రముఖలను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

యూఎస్-ఇరాన్ యుద్ధం తాత్కాలిక విరమణ ఒప్పందంపై సంతకం పెట్టకుండా లేచెళ్లిపోయిన ట్రంప్, ఏం జరుగుతుంది?

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments