Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సాధారణ స్థాయిలో భక్తులు... శ్రీవారి సేవలో 'సుప్రీమ్' టీం సభ్యులు

Webdunia
శనివారం, 7 మే 2016 (12:06 IST)
వారాంతం కావస్తున్నా తిరుమలలో రద్దీ మాత్రం సాధారణంగానే ఉంది. సాధారణంగా ప్రతి శనివారం తిరుమలలో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ ఉంటుంది. కానీ, ఈ శనివారం మాత్రం రద్దీ తక్కువగా ఉంది. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి నాలుగు గంటలు దర్శన సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టమెంట్లో వేచి ఉండగా వారికి దర్శనం 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 70,969 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.17 లక్షలుగా వసూలైంది.
 
అలాగే, తిరుమల శ్రీవారిని "సుప్రీమ్" సినీ యూనిట్‌ దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌‌తో పాటు హీరోయిన్‌ రాశీఖన్నా, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌ రాజు చిత్ర యూనిట్‌ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో సినీ యూనిట్‌ సభ్యులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సినీ ప్రముఖలను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

తర్వాతి కథనం
Show comments