Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సాధారణ స్థాయిలో భక్తులు... శ్రీవారి సేవలో 'సుప్రీమ్' టీం సభ్యులు

Webdunia
శనివారం, 7 మే 2016 (12:06 IST)
వారాంతం కావస్తున్నా తిరుమలలో రద్దీ మాత్రం సాధారణంగానే ఉంది. సాధారణంగా ప్రతి శనివారం తిరుమలలో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ ఉంటుంది. కానీ, ఈ శనివారం మాత్రం రద్దీ తక్కువగా ఉంది. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి నాలుగు గంటలు దర్శన సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టమెంట్లో వేచి ఉండగా వారికి దర్శనం 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 70,969 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.17 లక్షలుగా వసూలైంది.
 
అలాగే, తిరుమల శ్రీవారిని "సుప్రీమ్" సినీ యూనిట్‌ దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌‌తో పాటు హీరోయిన్‌ రాశీఖన్నా, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌ రాజు చిత్ర యూనిట్‌ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో సినీ యూనిట్‌ సభ్యులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సినీ ప్రముఖలను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

తర్వాతి కథనం
Show comments