Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు త్వరపడండి, డిసెంబర్ నెలకు సంబంధించిన టోకెన్లు ఈ నెలలో రిలీజ్.. ఎప్పుడంటే?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (23:09 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్సనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన నిర్దేశిత సర్వదర్సనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.

 
అలాగే తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్సనం టోకెన్లు తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 
కోవిడ్ కారణంగా ఇప్పటికే ఆఫ్ లైన్లో కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీని టిటిడి నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా కూడా టోకెన్లను మాత్రం టిటిడి ఆన్ లైన్ ద్వారానే ఇస్తోంది.

 
సర్వదర్సన ఉచిత టోకెన్లు, 300 రూపాయల శీఘ్రదర్సనం టోకెన్లు రెండు కూడా ఇదే విధంగా టిటిడి మంజూరు చేస్తోంది. అయితే ఆన్లైన్లో విడుదల చేసిన 30, 40 నిమిషాల్లోనే టోకెన్లన్నీ అయిపోవడం మాత్రం భక్తులను నిరాశకు గురిచేస్తోంది. ఆఫ్ లైన్లో కౌంటర్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలన్న డిమాండ్ భక్తుల నుంచి వినబడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anaconda: వామ్మో.. ఒడ్డుపై నుంచి నీటిలోకి దూకింది.. షాకైన పర్యాటకులు

కుమారుడిని చంపేసి భార్యపై భర్త హత్యాయత్నం

హైదరాబాద్‌లో కుండపోత వర్షం : నిమిషాల వ్యవధిలో రహదారులు జలమయం

నాడు యూఎస్ ఎలా స్పందించిందో అలానే స్పందించాం : నెతన్యాహు

భయానక ఘటన: జూ కీపర్‌ను చంపేసి పీక్కు తిన్న సింహాలు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankatahara Chaturthi 2025: బుధవారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే?

10-09-2025 బుధవారం ఫలితాలు - కీలక పత్రాలు.. నగదు జాగ్రత్త...

09-09-2025 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం....

కలియుగాది ఎప్పుడు వస్తుంది? ఆ రోజున ఏం చేయాలి?

చంద్రగ్రహణం: శుద్ధి కార్యాల తర్వాత ఏపీ-తెలంగాణల్లో తెరుచుకున్న దేవాలయాలు

తర్వాతి కథనం
Show comments