Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు త్వరపడండి, డిసెంబర్ నెలకు సంబంధించిన టోకెన్లు ఈ నెలలో రిలీజ్.. ఎప్పుడంటే?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (23:09 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్సనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన నిర్దేశిత సర్వదర్సనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.

 
అలాగే తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్సనం టోకెన్లు తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 
కోవిడ్ కారణంగా ఇప్పటికే ఆఫ్ లైన్లో కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీని టిటిడి నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా కూడా టోకెన్లను మాత్రం టిటిడి ఆన్ లైన్ ద్వారానే ఇస్తోంది.

 
సర్వదర్సన ఉచిత టోకెన్లు, 300 రూపాయల శీఘ్రదర్సనం టోకెన్లు రెండు కూడా ఇదే విధంగా టిటిడి మంజూరు చేస్తోంది. అయితే ఆన్లైన్లో విడుదల చేసిన 30, 40 నిమిషాల్లోనే టోకెన్లన్నీ అయిపోవడం మాత్రం భక్తులను నిరాశకు గురిచేస్తోంది. ఆఫ్ లైన్లో కౌంటర్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలన్న డిమాండ్ భక్తుల నుంచి వినబడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

తర్వాతి కథనం
Show comments