Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు త్వరపడండి, డిసెంబర్ నెలకు సంబంధించిన టోకెన్లు ఈ నెలలో రిలీజ్.. ఎప్పుడంటే?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (23:09 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్సనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన నిర్దేశిత సర్వదర్సనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.

 
అలాగే తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్సనం టోకెన్లు తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 
కోవిడ్ కారణంగా ఇప్పటికే ఆఫ్ లైన్లో కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీని టిటిడి నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా కూడా టోకెన్లను మాత్రం టిటిడి ఆన్ లైన్ ద్వారానే ఇస్తోంది.

 
సర్వదర్సన ఉచిత టోకెన్లు, 300 రూపాయల శీఘ్రదర్సనం టోకెన్లు రెండు కూడా ఇదే విధంగా టిటిడి మంజూరు చేస్తోంది. అయితే ఆన్లైన్లో విడుదల చేసిన 30, 40 నిమిషాల్లోనే టోకెన్లన్నీ అయిపోవడం మాత్రం భక్తులను నిరాశకు గురిచేస్తోంది. ఆఫ్ లైన్లో కౌంటర్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలన్న డిమాండ్ భక్తుల నుంచి వినబడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-06-2025 శనివారం దినఫలితాలు - బెట్టింగుల జోలికి పోవద్దు....

20-06-2025 శుక్రవారం దినఫలితాలు - మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు...

TTD: అలిపిరి వద్ద తనిఖీల్లో జాప్యం.. ఇకపై అలాంటి ఇబ్బందులకు చెక్.. ఎలా?

19-06-2025 గురువారం దినఫలితాలు - వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు...

బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?

తర్వాతి కథనం
Show comments