Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... శ్రీవారి సేవలో సచిన్ - చిరంజీవి - నాగార్జున

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత 15 రోజులకుపైగా రద్దీ కొనసాగుతుండగా ప్రస్తుతం మాత్రం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 6 గంట్లోనే శ్ర

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (10:39 IST)
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత 15 రోజులకుపైగా రద్దీ కొనసాగుతుండగా ప్రస్తుతం మాత్రం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 6 గంట్లోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది. గదులు సులువుగానే లభిస్తున్నాయి. తలనీలాలను గంటలోపే స్వామివారికి భక్తులు కళ్యాణకట్టలలో సమర్పిస్తున్నారు. మంగళవారం శ్రీవారిని 84,746 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 72 లక్షల రూపాయలు లభించింది. 
 
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండూల్కర్‌తో పాటు సినీనటుడు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్‌లు అర్చన సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సచిన్‌తో పాటు సినీనటులకు కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. సచిన్‌ నవ్వుతూనే ఆలయం నుంచి బయటకు వచ్చారు. అందరికీ రెండు చేతులతో నమస్కారం చేశారు సచిన్‌. కాగా, ఈ ప్రముఖులంతా మంగళవారం రాత్రి చార్టెడ్‌ విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి సన్నిధిలో బూతు పురాణం.. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ రెచ్చిపోయిన నరేష్ (video)

అద్భుతం: బతుకమ్మ కుంటను తవ్వితే నాలుగు అడుగుల్లోనే నీళ్లొచ్చాయా? నిజమెంత?

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. చెరో మూడేసి రోజులు.. బాండ్‌పై సంతకం

భారత్ చేతిలో డబ్బు వుందిగా.. 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి?: ట్రంప్

మాజీ మంత్రి విడదల రజనీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట- ఏం జరిగిందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

మహాశివరాత్రి: టీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు-అరుణాచలేశ్వరంకు ప్యాకేజీ.. ఎంత?

తులసి మొక్కను దక్షిణం వైపు నాటవద్దు.. కలబంద వంటి ముళ్ల మొక్కలను..?

17-02-2025 సోమవారం రాశిఫలాలు - విలాసాలకు విపరీతంగా ఖర్చు...

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments