Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. భక్తులకు అల్పాహారం

Webdunia
బుధవారం, 4 మే 2016 (12:56 IST)
తిరుమల తిరుపతి క్షేత్రం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం నుంచి తిరుమల క్షేత్రం భక్తులతో రద్దీగా ఉంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శనం 6 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి శ్రీవారి దర్శన సమయం 4 గంటలు పడుతోంది. మంగళవారం శ్రీవారిని 72,087 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.86 లక్షల లభించింది. 
 
తిరుమల శ్రీవారి భక్తులకు అల్పాహారాన్ని అందించే కార్యక్రమాన్ని తితిదే ఈఓ సాంబశివరావు ప్రారంభించారు. ఇప్పటి వరకు అన్నప్రసాదాన్ని మాత్రమే భక్తులకు అందిస్తోంది. అయితే వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం అల్పాహారాన్ని ఈవో సాంబశివరావు ప్రారంభించారు. తిరుమలలోని అన్నదాన సముదాయంలో ఈఓ అల్పాహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటల వరకు అల్పాహారంను భక్తులకు అందించనున్నారు. అన్న ప్రసాదాన్ని మాత్రం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

తర్వాతి కథనం
Show comments