Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ తర్వాత రికార్డు స్థాయిలో శ్రీవారికి భారీ కానుకలు

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (10:36 IST)
డిసెంబర్ మాసంలో ఇప్పటికే ఐదు సార్లు శ్రీవారి హుండి ఆదాయం 3 కోట్లు దాటింది. లాక్ డౌన్ అనంతరం శనివారం రికార్డు స్థాయిలో స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు సంఖ్య 45వేలు దాటనుంది. 
 
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున భక్తులు భారీ సంఖ్య హాజరయ్యారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. 
 
ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం 4గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతించింది టీటీడీ. ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించింది.
 
కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో దర్శన టోకెన్లు వున్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. అయితే రికార్డు స్థాయిలో శ్రీవారికి హుండి ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ తరువాత స్వామి వారికి అత్యధిక హుండి ఆదాయం సమర్పించారు భక్తులు. ఇవాళ హుండి ద్వారా శ్రీవారికీ 4.3 కోట్లు ఆదాయం వచ్చింది. 
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments