Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతస్వర్ణమయం పథకం ఏమైంది: బంగారాన్ని ఏం చేశారు?

Webdunia
గురువారం, 2 జులై 2015 (14:28 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి స్వర్ణతాపడం ప్రాజెక్టు అయిన అనంతస్వర్ణమయం పథకం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రాజెక్టు కోసం విరాళమిచ్చిన బంగారాన్ని ఏం చేశారో తెలపాలని టీటీడీ ఈవో సాంబశివరావును భక్తులు కోరారు. ఈ మేరకు కొంతమంది భక్తులు ఈవోకు లేఖలు రాశారని తెలిసింది. 
 
2008లో అప్పటి టీటీడీ చైర్మన్, దివంగత నేత డీకే ఆదికేశవులునాయుడు హయాంలో వెంకన్న ఆలయానికి బంగారుతాపడం కోసం అనంతస్వర్ణమయం పేరిట ప్రత్యేకంగా ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. డీకే ఆదికేశవులు నాయుడు పిలుపు మేరకు నాడు భక్తులు 200 కిలోల బంగారాన్ని ఆలయానికి విరాళమిచ్చారు. దీనికి సంబంధించిన పనులు జరిగినా.. 2011 ఆలయం గోడలకు ముప్పు తప్పదని అప్పటి ఈవో.. పనుల్ని ఉన్నపళంగా నిలిపేశారు. 
 
కానీ ఈ ప్రాజెక్టు పనుల కోసం వినియోగించి, మిగిలిన బంగారాన్ని ఏం చేశారని విషయాలను మాత్రం ఈవో గానీ, పాలకమండలి కానీ తెలియజేయలేదు. అనంతస్వర్ణమయం భక్తుల ప్రశ్నలకు, ఫిర్యాదులకు స్పందించిన ప్రస్తుత ఈఓ త్వరలో బంగారం వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Show comments