Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఆలయాల్లో స్థానిక శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలి : జేఈఓ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:31 IST)
తితిదేకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ఉత్సవాలు, పర్వదినాల సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు, భజన మండళ్ళు, వేదపారాయణందారుల సేవలను వినియోగించుకోవాలని తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. 
 
తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఉపమాక, అనంతవరం, ఒంటిమిట్ట, చంద్రగిరి, పిఠాపురం, నారాయణవనం, నగరి, అప్పలాయగుంటలోని తితిదే ఆలయాల పరిసర గ్రామాలు, మండలాల్లో శ్రీవారి సేవకులు, భజన మండళ్ళు, వేదపారాయణందారులను గుర్తించి వారి సేవలను వినియోగించుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. 
 
ఇలా చేయడం వల్ల తిరుపతి నుంచి సేవకులను, భజన మండళ్లను, వేదపారాయణందారులను పంపాల్సిన అవసరం ఉండదని చెప్పారు. స్థానికంగా ఉన్న వారి సేవలను వినియోగించడం ద్వారా వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని వివరించారు. పరిసర ప్రాంతాల వారు కావడంతో ఉత్సాహంగా ధర్మప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments