Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలతో శ్రీవారి ఆలయం మూతపడలేదు: టీటీడీ పీఆర్వో రవి

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (16:39 IST)
భారీ వర్షాలతో శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మూతపడినట్లు వస్తున్న వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా వెంకన్న ఆలయాన్ని మూసివేయలేదని.. సామాజిక వెబ్ సైట్లలో వెంకన్న స్వామి ఆలయాన్ని మూసేసినట్లు వస్తున్న వార్తలను టీటీడీ అధికారులు కొట్టిపారేశారు. 
 
స్వామి పుష్కరిణి, మండపాలు నీట మునిగాయని వాట్సాఫ్ మెసేజ్‌ల్లో ఫోటోలు వైరల్‌లా పాకడంతో.. భక్తులు శ్రీవారి ఆలయాన్ని భారీ వరదల కారణంగా మూసివేశారని భావించారు. దీనిపై టీటీడీ పీఆర్వో తలారి రవి మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయాన్ని మూసివేయలేదని.. కొండపై నిలుస్తున్న వర్షపు నీటిని సత్వరమే అండర్ గ్రౌండ్స్ కాలువ ద్వారా తొలగిస్తున్నామని చెప్పారు.
 
గంటకు నీటిని తొలగించే ప్రక్రియ సాగుతోందన్నారు. ఆదివారం 37వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, మరో 10వేల మంది భక్తులు 8 కంపార్ట్‌మెంట్లలో స్వామివారి దర్శనం కోసం వేచివున్నారని రవి వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments