Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి గంగజాతర ప్రారంభం - అర్థరాత్రి చాటింపు - బైరాగి వేషంలో భక్తుల మొక్కులు

Webdunia
బుధవారం, 11 మే 2016 (10:34 IST)
రాయలసీమ జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి పుట్టినిల్లైన అవిలాలలో చాటింపు తర్వాత చాటింపు ప్రారంభమైంది. అవిలాల నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, సారెను తీసుకుని తిరుపతి పొలిమేరల్లో గంగ్మ తరపున తిరుపతికి చెందిన కైకాల వంశీకులు అందుకుని గంగమ్మ దేవస్థానం ఈఓ సుబ్రమణ్యంకు అందజేశారు. 
 
బుధవారం తెల్లవారుజామున మూడు గంటలలోపు తిరుపతి పొలిమేరల్లో నాలుగు దిక్కులు తిరిగి పసుపు, కుంకుమ చల్లుతూ పూజలు చేసి చాటింపు వేశారు. గంగ జాతర పూర్తయ్యే వరకు నగరంలో నివసించే పట్టణ ప్రజలు బయటకు వెళ్ళకూడదన్నది చాటింపు అర్థం.
 
బుధవారం ఉదయం నుంచే గంగమ్మ ఆలయంలో సందడి నెలకొంది. బైరాగివేషలో భక్తులు గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. విబూది, తెల్లనామం పూసుకుని, నల్లబొట్టు పెట్టుకుని రేళ్ల కాయల మాలలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి చేతిలో వేపాకు, చీపురు పుల్లలు పట్టుకుని బూతులు తిడుతూ ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

తర్వాతి కథనం
Show comments