Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి గంగజాతర ప్రారంభం - అర్థరాత్రి చాటింపు - బైరాగి వేషంలో భక్తుల మొక్కులు

Webdunia
బుధవారం, 11 మే 2016 (10:34 IST)
రాయలసీమ జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి పుట్టినిల్లైన అవిలాలలో చాటింపు తర్వాత చాటింపు ప్రారంభమైంది. అవిలాల నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, సారెను తీసుకుని తిరుపతి పొలిమేరల్లో గంగ్మ తరపున తిరుపతికి చెందిన కైకాల వంశీకులు అందుకుని గంగమ్మ దేవస్థానం ఈఓ సుబ్రమణ్యంకు అందజేశారు. 
 
బుధవారం తెల్లవారుజామున మూడు గంటలలోపు తిరుపతి పొలిమేరల్లో నాలుగు దిక్కులు తిరిగి పసుపు, కుంకుమ చల్లుతూ పూజలు చేసి చాటింపు వేశారు. గంగ జాతర పూర్తయ్యే వరకు నగరంలో నివసించే పట్టణ ప్రజలు బయటకు వెళ్ళకూడదన్నది చాటింపు అర్థం.
 
బుధవారం ఉదయం నుంచే గంగమ్మ ఆలయంలో సందడి నెలకొంది. బైరాగివేషలో భక్తులు గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. విబూది, తెల్లనామం పూసుకుని, నల్లబొట్టు పెట్టుకుని రేళ్ల కాయల మాలలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి చేతిలో వేపాకు, చీపురు పుల్లలు పట్టుకుని బూతులు తిడుతూ ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు కూడా ర్యాగింగ్‌తో సమానం : యూజీసీ

హైదరాబాద్‌లో విషాదం.. కల్తీ కల్లు సేవించి 15 మందికి అస్వస్థత

ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు.. ఎందుకని?

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

అన్నీ చూడండి

లేటెస్ట్

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

తర్వాతి కథనం
Show comments