Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో మండుతున్న ఎండలు... శ్రీవారి భక్తులు ఉక్కిరిబిక్కిరి

తిరుమల వెంకన్న భక్తులపై ఎండ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఉదయం పొద్దుపొడిచింది మొదలు భగభగ మండే అగ్నిగోళంలా సూర్యుడు చెలరేగిపోతున్నాడు. దీంతో భక్తులు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక విలవిలలాడిపోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్మాత్మిక సంస్థ టిటిడి భక్తులకు వేస

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (14:48 IST)
తిరుమల వెంకన్న భక్తులపై ఎండ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఉదయం పొద్దుపొడిచింది మొదలు భగభగ మండే అగ్నిగోళంలా సూర్యుడు చెలరేగిపోతున్నాడు. దీంతో భక్తులు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక విలవిలలాడిపోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్మాత్మిక సంస్థ టిటిడి భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడం లేదు. గోవిందా..గోవిందా.. అంటూ భగభగ మండే ఎండల్లోనే చెప్పులు లేని కాళ్ళతో భక్తులు పరుగులు తీస్తున్నారు. 
 
తిరుమల అంటే నిత్య కళ్యాణం.. పచ్చతోరణం.. ఆ కలియుగ వైకుంఠుడికి ప్రతినిత్యం సంబరమే. ఆయన వైభోగాన్ని చూడటం కోసం అన్ని వేళలా భక్తులు ఎగబడుతూనే ఉంటారు. స్వామి దర్శనం పొందాలనే ఆతృత వారి అన్ని కష్టాలను మరిపిస్తోంది. కానీ వెంకన్న భక్తులను ఎండతీవ్రత బాగా ఇబ్బంది పెడుతోంది. స్వామివారి సన్నిధిలో తిరుపతిలోని ముఖ్య వసతి గృహాల్లో చెప్పులు లేకుండానే భక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే భగభగ మండే ఎండ తీవ్రతకు వారి కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి. 
 
ప్రతిసారి వేసవిలో ఎంతోకొంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే టిటిడి ఈసారి మాత్రం వాటిని పట్టించుకోలేదు. తిరుమల వరకే తూతూమంత్రంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని తిరుపతిలో ఉండే భక్తుల సముదాయాలను పూర్తిగా విస్మరించింది. బయటి ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల్లో ఎక్కువమంది తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం అతిథి గృహాల్లో వసతి పొందుతూ ఉంటారు. ఈ రెండు ప్రాంతాలు భక్తులతో ఎప్పుడూ కళకళలాడుతుంటాయి. వీటికి విశాలమైన ప్రాంగణాలు ఉన్నప్పటికీ అది పూర్తిగా బండపరుపుతో ఉండడం వల్ల భక్తులు నడవలేని పరిస్థితి ఏర్పడుతోంది. 
 
గతంలో ఇలాంటి ప్రాంతాల్లో వేసవి వచ్చిందంటే పెయింట్ పూయడం, అలాగే చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం, అక్కడక్కడ కార్పెట్లు వేయడం ఇలాంటివి చేసేది టిటిడి. వేసవి మొదలై చాలారోజులవుతున్నా ఈసారి మాత్రం అలాంటి ఏర్పాట్లు ఏదీ చేయలేదు. దీంతో భక్తులు వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి నీడ లేకుండా ఆ వసతి గృహాల ప్రాంగణాల్లో నడుస్తూ ఉన్న భక్తుల విలవిలలాడుతున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని కిందకు వచ్చే లోపల తీవ్ర అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.
 
టిటిడి అనుకుంటే భక్తులకే కాదు. తిరుపతి నగరం మొత్తాన్ని వేడి తీవ్రత నుంచి బయట పడేయగలదు. అన్ని నిధులున్నాయి కాబట్టి చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ లాంటి ద్రవపదార్థాలను సరఫరా చేస్తే భక్తులకు చాలా ఉపశమనంగా ఉంటుంది. ఇలాంటివి చేయడానికి మంచి ఆలోచన ఉంటే చాలు కానీ టిటిడికి డబ్బులకు ఎలాంటి కొదవలేదు. అయినా కూడా ఎందుకు ఇలాంటి విషయాలను విస్మరిస్తున్నారో ఆ కలియుగ వైకుంఠునికే తెలియాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: భారతదేశంపై ట్రంప్ అక్కసు, యాపిల్ ప్లాంట్ ఆపేయమంటూ ఒత్తిడి

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments