వీణాపాణీయుడై సరస్వతీమూర్తిగా విహరించనున్న శ్రీవారు

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని ఐదు తలల చిన్న శేషవాహనంపై విహరించారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడ

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (12:57 IST)
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని ఐదు తలల చిన్న శేషవాహనంపై విహరించారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడుగా, చిన్న శేషవాహనాన్ని నాగ జాతిలో అనంతుడైన వాసుకిగా పురాణాలు పేర్కొన్నాయి. చిన్న శేషవాహనాన్ని దర్శించే భక్తులకు దివ్య చైతన్యం ద్వారా కుండలినీ యోగఫలం లభిస్తుందని ప్రతీతి. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల లోపు మలయప్పస్వామి వీణాపాణీయుడై సరస్వతీమూర్తిగా హంస వాహనంపై దర్శనమిచ్చారు. 
 
పరమశివుని హస్తాభరణంగా, కంఠాభరణంగా విరాజిల్లే వాసుకి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ్రీవారు చిన్నశేష వాహన సేవలో తరించాడు. ఈ వాహన సేవను దర్శించి, ధ్యానించేవారికి మనసు, కర్మ శ్రీనివాసుని అధీనమై, ఆయనకు అభిముఖమవుతాయని, అప్పుడు మానవుడు మాధవునికి నిజమైన సేవకుడవుతాడని పెద్దలు చెబుతారు.
 
కాగా, తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. స్వామివారిని శనివారం 58,827 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,879 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.38 కోట్లుగా వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం
Show comments