Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద శేష వాహనంపై అమ్మవారు... భక్తులకు కనువిందు...

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (18:35 IST)
కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారు గురువారం ఉదయం పెద్దశేష వాహనంపై ఊరేగారు. ఏడు పడగల పెద్ద శేషవాహనంపై అమ్మావారు భక్తులకు దర్శనమిచ్చారు. మహా విష్ణువుకు ఆదిశేషుడు ప్రచండ సేవకుడిగా ప్రతీతి. పవళించే పరుపుగా, దిండుగా, గొడుగుగా, ఆభరణంగా ఆది శేషుడు మహావిష్ణువుకు సేవలు అందిస్తుంటారు. ఈ సేవలను పరిగణలోకి తీసుకుని ఆదిశేషుడిని ప్రచండ సేవకుడిగా పేరొందారు. 

 
ఈ వాహనంపై పద్మావతీ అమ్మవారు తిరుమాడ వీధులలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ ఊరేగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు పెద్దశేషవాహనంతో ఆరంభమైతే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు చిన్న శేష వాహనంతో ఆరంభమవుతాయి. ఈ వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీగోపాల్, జేఈవో పోలా భాస్కర్, సివిఎస్వో జి. శ్రీనివాస్, డిప్యూటీ ఈవో చెంచు లక్ష్మి, ఏఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments