Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణం చేస్తే ఒక్క రోజులోనే శ్రీవారి దర్శనం ఎలా? (video)

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (08:43 IST)
దూర ప్రాంతాలకు చెందిన శ్రీవారి భక్తులకు ఓ శుభవార్త. ఇకపై శ్రీవారి దర్శనం కోసం రైలులో తిరుపతికి చేరుకుంటే ఒక్క రోజులోనే దర్శనం భాగ్యం లభించనుంది. ఈ విషయాన్ని రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలని భావించే భక్తులు, రైల్లో తిరుపతికి చేరుకుంటే, ఒక్క రోజులోనే స్వామివారి దర్శనంతో పాటు, తిరుచానూరు అమ్మవారి దర్శనాన్ని కూడా కల్పించేలా రూ.990 ధరలో టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. 
 
అయితే, ఉదయం 8లోగా తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న భక్తులకు మాత్రమే ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ఇందులో భాగంగా ఏసీ వాహనంలో తిరుమలకు తీసుకుని వెళ్లి, ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనం కూడా ఇది మధ్యాహ్నం ఒంటిగంటలోపు పూర్తవుతుంది. 
 
కానీ, కొండపై భక్తుల రద్దీని బట్టి ఈ సమయం మారవచ్చు. ఆపై సొంత ఖర్చుతో భోజనం అనంతరం యాత్రికులకు తిరుచానూరు తీసుకుని వెళ్లి అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి, తిరిగి రైల్వే స్టేషన్‌కు చేరుస్తారు. ఇది ఒక రోజు ప్యాకేజీ అని, వసతి సౌకర్యాలు ఉండవని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

లేటెస్ట్

30-07-2025 బుధవారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి...

భార్యను బాధపెట్టేవాడు ఏమవుతాడు? గరుడ పురాణంలో ఏముంది?

కల్కి జయంతి: కల్కి రాకతో కలియుగం అంతం.. సత్యయుగం ప్రారంభం అవుతుందట

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

తర్వాతి కథనం
Show comments