తెరుచుకున్న శ్రీవారి ఆలయ ద్వారం... ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా....

Webdunia
బుధవారం, 9 మార్చి 2016 (09:59 IST)
సూర్యగ్రహణం పరిసమాప్తం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. ఉదయం 10 గంటలకు వేదపండితులు శ్రీవారి ఆలయ తలుపులను తెరిచారు. గ్రహణం కావడంతో నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆలయ తలుపులు తెరిచిన తర్వాత ఆలయాన్ని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేశారు. 
 
మధ్యాహ్నం 1 గంట నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం సందర్భంగా సహస్త్ర దీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది. దాంతోపాటు సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను కూడా టిటిడి పూర్తిగా రద్దు చేసింది. అలాగే తరిగొండ వెంగమాంబ నిత్యన్నదాన సముదాయాన్ని కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెరవనున్నారు. అయితే అన్నదానాన్ని మాత్రం నిలిపివేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

కేతన్‌ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Show comments