Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉజ్జయిని సింహస్థ కుంభమేళాకు పోటెత్తిన జనం.. డిగ్గీరాజా పుణ్యస్నానం.. 12 ఏళ్లకు?

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (17:46 IST)
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగే సింహస్థ కుంభమేళాకు భక్తజనం పోటెత్తారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. నెల రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా శుక్రవారం ప్రారంభమైంది. పుణ్యస్నానాల కోసం భక్తులు మొదటి రోజు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఉజ్జయినిలో దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వరుడి ఆలయం ఉంది. 
 
ఈ కుంభమేళా సందర్భంగా శిప్రా నదీ తీరంలో సాధువులు, భక్తులు శుక్రవారం పుణ్యస్నానాలు ఆచరించారు. సింహస్థ కుంభమేళా సందర్భంగా ఉజ్జయినికి సుమారు 5 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈసారి ‘గ్రీన్‌ సింహస్థ’గా ఉండాలని శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా కుంభమేళాలో శుక్రవారం పుణ్యస్నానం చేశారు.  

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

Show comments