Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివ శివా.. ఇదేమి పూజ.. శివలింగంపై పాదాలు మోపి పూజలు

సాక్షాత్తూ పరమశివుడి స్వరూపంగా శివలింగాన్ని భక్తులు అత్యంత నిష్టగా పూజిస్తారు. శివలింగంలోనే శివుని సాక్షాత్కారం పొందుతారు. హిమలింగ దర్శనం కోసం ఏటా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమరనాథ్‌ యాత్రకు వెళుతుంటారు

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (09:44 IST)
సాక్షాత్తూ పరమశివుడి స్వరూపంగా శివలింగాన్ని భక్తులు అత్యంత నిష్టగా పూజిస్తారు. శివలింగంలోనే శివుని సాక్షాత్కారం పొందుతారు. హిమలింగ దర్శనం కోసం ఏటా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమరనాథ్‌ యాత్రకు వెళుతుంటారు. అలాంటి బోలాశంకరుడిని ఘోరంగా అవమానపరచాడు ఓ స్వామీజీ. శివలింగంపై పాదాలు మోపి పూజలు చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో సంచలనమైంది. 
 
బెంగళూరు నగర శివారు నెలమంగల సమీపంలోని కెరెకత్తిగనూరు గ్రామంలోని ఓ శైవమఠంలో శివలింగంపై కాళ్లు పెట్టి శాంతిలింగేశ్వర స్వామిజీ పూజలు చేస్తున్న ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ స్వామిజీ తీరుపై శైవభక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 5న బెంగళూరు శివారు రంగనబెట్ట సమీపంలో శాంతలింగేశ్వర మఠానికి చెందిన మరో శాఖ ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా శివలింగానికి ప్రాణప్రతిష్ట చేసే సమయంలో మఠానికి చెందిన శాంతలింగేశ్వర స్వామి తన పాదాలను ఆ శివలింగంపై పెట్టగా, ఆయన శిష్యులు పూజలు చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. యేడాదిలో ఉగాది రోజు మాత్రమే మాట్లాడే శాంతలింగేశ్వర స్వామీజీ ఈ విషయమై తన శిష్యుల ద్వారా మీడియాకు వివరణ ఇప్పించారు. వీరశైవ విధానం ప్రకారమే పూజలు జరిగాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments