Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు, ఎప్పటి నుంచో తెలుసా?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:26 IST)
చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. ఇప్పటికే తిరుచానూరు పద్మావతి ఆలయంతో పాటు శ్రీనివాసమంగాపురంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే అప్పలాయగుంటలోను పవిత్రోత్సవాలను నిర్వహించడానికి టిటిడి సిద్థమైంది. 
 
ఈ నెల 13వ తేదీ నుంచి 15 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టిటిడిలో ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 12వ తేదీ సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.
 
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 
 
సెప్టెంబర్ 13వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 14వ తేదీన పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 15వ తేదీన మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సంధర్భంగా మూడురోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments