ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు, ఎప్పటి నుంచో తెలుసా?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:26 IST)
చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. ఇప్పటికే తిరుచానూరు పద్మావతి ఆలయంతో పాటు శ్రీనివాసమంగాపురంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే అప్పలాయగుంటలోను పవిత్రోత్సవాలను నిర్వహించడానికి టిటిడి సిద్థమైంది. 
 
ఈ నెల 13వ తేదీ నుంచి 15 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టిటిడిలో ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 12వ తేదీ సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.
 
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 
 
సెప్టెంబర్ 13వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 14వ తేదీన పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 15వ తేదీన మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సంధర్భంగా మూడురోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

అన్నీ చూడండి

లేటెస్ట్

సంఖ్యా శాస్త్రం: 12 నెలలు.. ఏ నెలలో పుట్టిన మహిళలు.. ఎలా వుంటారు..?

Sparsha Darshanam: శ్రీశైలం స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత లడ్డూ

27-10-2025 సోమవారం దినఫలాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Skanda Sashti 2025: స్కంధ షష్ఠి రోజున పూజ ఎలా చేయాలి.. ఏ శ్లోకాన్ని పఠించాలి?

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

తర్వాతి కథనం
Show comments