Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు, ఎప్పటి నుంచో తెలుసా?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:26 IST)
చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. ఇప్పటికే తిరుచానూరు పద్మావతి ఆలయంతో పాటు శ్రీనివాసమంగాపురంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే అప్పలాయగుంటలోను పవిత్రోత్సవాలను నిర్వహించడానికి టిటిడి సిద్థమైంది. 
 
ఈ నెల 13వ తేదీ నుంచి 15 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టిటిడిలో ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 12వ తేదీ సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.
 
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 
 
సెప్టెంబర్ 13వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 14వ తేదీన పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 15వ తేదీన మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సంధర్భంగా మూడురోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments