తులా మాసం పూజ కోసం నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:27 IST)
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు శనివారం తెరుచుకోనున్నాయి. ప్రతి యేటా జరిగే తులా మాసం పూజ‌ల కోసం సాయంత్రం 5 గంట‌ల‌కు ట్రావెన్‌కోర్ బోర్డు అయ్య‌ప్ప‌ ఆల‌యాన్ని తెర‌వ‌నుంది. 
 
ఆదివారం నుంచి 21వ తేదీ వ‌ర‌కు అయ్య‌ప్ప ఆల‌యంలోకి భ‌క్తుల‌కు అనుమ‌తిస్తారు. అలాగే, ఆదివారం లాటరీ విధానంలో శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌ధాన పూజారిని ఎంపిక చేయ‌నున్నారు. 21న శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని ట్రావెన్‌కోర్ బోర్డు మూసివేయ‌నుంది. 
 
మ‌ళ్లీ న‌వంబ‌ర్ 2వ తేదీన ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. ఆ మ‌రుస‌టి రోజే ఆలయాన్ని మూసేసి, మండ‌లం - మ‌క‌ర‌విలాక్కు పండుగ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 15న ఆల‌యాన్ని మ‌ళ్లీ తెర‌వ‌నున్నారు.
 
అయితే, ఆదివారం నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు వ‌ర్చ్యుల్ బుకింగ్ ద్వారానే అనుమ‌తిస్తారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్త‌యిన స‌ర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్ప‌నిసరిగా తమ వెంట తీసుకునిరావాలన్న నిబంధనను ట్రావెన్‌కోర్ దేవస్థానం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

మోహన్ బాబు యూనివర్సిటీలో సమర్థ 2025, 36-గంటల జాతీయ హ్యాకథాన్

Montha Cyclone: జగన్‌కి తుఫాను గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. రవి కుమార్

డీప్ ఫేక్‌లపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ ప్రత్యేక దృష్టి... ఇక వారికి చుక్కలేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

కోటి సోమవారం అంటే ఏమిటి?

Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు

29-10-2025 బుధవారం దినఫలితాలు -

తర్వాతి కథనం
Show comments