Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారికి రూ. 17 లక్షల తులాభారం, టిటిడి ఈవోనే తొలిసారిగా..?

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (13:56 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మివ్రతం పర్వదినం సంధర్భంగా టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామంత్రి వేణుగోపాలక్రిష్ణ, టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు కలిసి తులాభారం ప్రారంభించారు. ఆలయంలోని సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తరువాత ఛైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి తులాభారాన్ని ప్రారంభించారు.
 
మొదటగా ఈవోనే తులాభారంలో కూర్చున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన జయచంద్ర దంపతులు 17 లక్షల రూపాయల విలువైన తులాభారం ఆలయానికి బహూకరించారు.
 
దీంతో ఈ తులాభారాన్ని వరలక్ష్మి వ్రతం సంధర్భంగా ప్రారంభించారు. ఇక నుంచి భక్తులకు తులాభారం అందుబాటులో రానుంది. పుట్టిన పిల్లలకు ఎక్కువగా మ్రొక్కులు తీర్చుకోవడానికి తులాభారాన్ని సాధారణంగా వాడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తర్వాతి కథనం
Show comments