కృష్ణా పుష్కరాలకు శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం - టిటిడి ఈవో

Webdunia
మంగళవారం, 3 మే 2016 (13:25 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నమూనా ఆలయాన్ని కృష్ణా పుష్కరాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను టిటిడి ఈవో సాంబశివరావు ఆదేశించారు. నవ్యాంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ శ్రీవారి ఆలయాలను నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారుచేయాలన్నారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో టిటిడి ఇంజనీరింగ్‌ అధికారులతో ఈవో సమావేశమయ్యారు.
 
టిటిడి నిర్మించిన ఆలయాల్లో విగ్రహాలకు సంబంధించి ఆలయ నిర్మాణ శైలిని పరిశీలించడానికి మార్పులు చేయడానికి సీఇ ఆధ్వర్యంలో స్థపతి, అర్చకులు, ఇంజనీరింగ్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు. మే 10వ తేదీన శ్రీరామానుజ సహస్రాబ్ధి సంధర్భంగా ప్రత్యేకంగా పుస్తకాలు, సీడీలను ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 
 
మే 22 నుంచి ప్రారంభం కానున్న శుభప్రదంకు అవసరమైన పుస్తకాల ముద్రణ పూర్తిచేయాలని సూచించారు. అలిపిరి వద్ద వాటర్‌ కూలర్స్ ఏర్పాటు చేయాలని, నడక దారిలో ఎండ వేడి నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు మెట్లపై తెల్లరంగు వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘనంగా బోనాల ఉత్సవాలు.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

దేశంలోనే అత్యంత ధనిక రాజ్యసభ్యుడు ఎవరో తెలుసా? మన తెలుగు నేతే!

Pawan Kalyan: పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ దీక్ష

మిరప ఎగుమతుల్లో పురుగుమందు.. సమస్య పరిష్కారానికి ఏపీ కమిటీ

6జీ, ఏఐ క్వాంటం టెక్నాలజీస్ కోసం రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

తర్వాతి కథనం
Show comments