Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కరాలకు శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం - టిటిడి ఈవో

Webdunia
మంగళవారం, 3 మే 2016 (13:25 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నమూనా ఆలయాన్ని కృష్ణా పుష్కరాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను టిటిడి ఈవో సాంబశివరావు ఆదేశించారు. నవ్యాంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ శ్రీవారి ఆలయాలను నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారుచేయాలన్నారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో టిటిడి ఇంజనీరింగ్‌ అధికారులతో ఈవో సమావేశమయ్యారు.
 
టిటిడి నిర్మించిన ఆలయాల్లో విగ్రహాలకు సంబంధించి ఆలయ నిర్మాణ శైలిని పరిశీలించడానికి మార్పులు చేయడానికి సీఇ ఆధ్వర్యంలో స్థపతి, అర్చకులు, ఇంజనీరింగ్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు. మే 10వ తేదీన శ్రీరామానుజ సహస్రాబ్ధి సంధర్భంగా ప్రత్యేకంగా పుస్తకాలు, సీడీలను ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 
 
మే 22 నుంచి ప్రారంభం కానున్న శుభప్రదంకు అవసరమైన పుస్తకాల ముద్రణ పూర్తిచేయాలని సూచించారు. అలిపిరి వద్ద వాటర్‌ కూలర్స్ ఏర్పాటు చేయాలని, నడక దారిలో ఎండ వేడి నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు మెట్లపై తెల్లరంగు వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments