తిరుమల వెంకన్న సోదరుడి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Webdunia
గురువారం, 13 మే 2021 (19:14 IST)
చాలామంది భక్తులకు తిరుమల వేంకటేశ్వరస్వామికి సోదరుడు ఉన్నాడా అన్న అనుమానం ఉంటుంది. అయితే స్వామివారికి స్వయానా అన్న తిరుపతిలో వెలిసిన గోవిందరాజస్వామి. తిరుపతికి వచ్చే భక్తులలో చాలామంది గోవిందరాజస్వామిని దర్సించుకుంటారు కానీ ఆయన ప్రాశస్త్యం, ప్రాముఖ్యత తెలియదు. అంతటి ప్రాముఖ్యత కలిగిన గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టిటిడి నిర్వహించింది.
 
తిరుమల వేంకటేశ్వరస్వామి స్వయానా అన్న తిరుపతిలో వెలసిన గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని కోవిడ్-19 ప్రకారం ఏకాంతంగా నిర్వహించారు.
 
ముందుగా తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోడలు, శుద్ధి చేసిన తరువాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ సుగంధ ద్రవ్యాలను కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత భక్తులను దర్సనానికి అనుమతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం

కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి

రాత్రి 11 గంటల ప్రాంతంలో కారులో కూర్చుని మాట్లాడుకోవడం అవసరమా? కోవై రేప్ నిందితుల అరెస్ట్

Constable: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోయాడు... రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

తర్వాతి కథనం
Show comments