Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 నుంచి కళ్యాణ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు

Webdunia
శనివారం, 14 మే 2016 (11:31 IST)
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తితిదే నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంతమండపానికి వేంచేస్తారు. తొలి రెండు రోజులు మే 25, 27 తేదీలలో శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్‌ సమేత శ్రీక్రిష్ణస్వామి వార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 
 
వసంత రుతువుతో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం. రెండోరోజు మే 26 నుంచి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వూంజల్‌ సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై సజ్జనార్ సీరియస్.. నానికి కితాబ్.. మారకపోతే అంతే సంగతులు

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

Tesla Coming: టెస్లాను ఏపీకి చంద్రబాబు సర్కారు తీసుకువస్తుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తర్వాతి కథనం
Show comments