Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి చెంత అన్నీ తానై పెత్తనం చేస్తున్న ఓ అధికారి.. ఎవరు..?

దాదాపు రెండేళ్ళపాటు స్తబ్దుగా ఉన్న తిరుమల టిటిడి జెఈఓ శ్రీనివాసరాజు మళ్ళీ ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు. తిరుమలలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. కొత్తగా వచ్చిన ఈఓ సింఘాల్‌‍కు తితిదే వ్యవహారాలపై అవగాహన కల్పిస్తూ ఆయనతో చర్చిస్తూ కీలక నిర్ణయాలు తీస

Webdunia
శనివారం, 27 మే 2017 (13:37 IST)
దాదాపు రెండేళ్ళపాటు స్తబ్దుగా ఉన్న తిరుమల టిటిడి జెఈఓ శ్రీనివాసరాజు మళ్ళీ ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు. తిరుమలలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. కొత్తగా వచ్చిన ఈఓ సింఘాల్‌‍కు తితిదే వ్యవహారాలపై అవగాహన కల్పిస్తూ ఆయనతో చర్చిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాంబశివరావు బదిలీ తరువాత శ్రీనివాసరాజును గమనించిన వారికి ఎవరికైనా ఇది అర్థమవుతుంది. 
 
తిరుమల జెఈఓగా విశేషమైన అనుభవం సొంతం చేసుకున్న శ్రీనివాసరాజు గడిచిన రెండేళ్ళలో విధి నిర్వహణలో అంత చురుగ్గా లేరనే చెప్పాలి. సింఘాల్ ముందు ఈఓగా పనిచేసిన సాంబశివరావుతో పొడచూపిన విబేధాల వల్ల ఆయన అలా ఉండిపోయారు. సాంబశివరావు సర్వస్వం తానేగా వ్యవహరించారు. తిరుమలలో జరిగే వారపు సమావేశాల్లోను ఈఓ నేరుగా పాల్గొనడం మొదలుపెట్టడంతో సమీక్షల్లో జెఈఓ కూడా అందరి అధికారుల్లాగే ఒక అధికారిగా మిగిలిపోయారు. సాంబశివరావు, శ్రీనివాసరాజు మధ్య ప్రఛ్ఛన్న యుద్థం జరుగుతోందని తితిదేలో అందరూ బహిరంగానే మాట్లాడుకునేవారు. 
 
దాదాపు 20 రోజుల క్రితం ఈఓగా వచ్చిన అనిల్ కుమార్ సింఘాల్, సాంబశివరావు తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎవరి అధికారాలు వారు ఉపయోగించుకోండి. అందరూ బాగా పనిచేయాలి... అని అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ అవకాశాన్ని శ్రీనివాసరాజు బాగా వినియోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈఓతో చర్చిస్తూ కీలక నిర్ణయాలూ తీసుకుంటున్నారు. వేసవిలో శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని సాంబశివరావు ఉన్నప్పుడే నిర్ణయం తీసుకుని అమలు చేయడం మొదలుపెట్టారు. 
 
రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24,25తేదీల్లోనూ బ్రేక్ దర్శనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జెఈఓగా ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో తిరుగుతూ భక్తుల అవసరాలు తెలుసుకుంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల తిరుమల పర్యటన విజయవంతం చేశారు. వారపు సమీక్ష సమావేశాలను తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తన అధికారాలను సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. ఈఓకు, జెఈఓలకు మధ్య ఇదే సఖ్యత ఉంటే మంచి ఫలితాలు వస్తానయడంలో సందేహం లేదు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments