తిరుమల ఆకాశగంగ వద్ద తొలిసారిగా హనుమజ్జయంతి వేడుకలు: టిటిడి ఈఓ

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (22:06 IST)
హనుమంతుడు ఎక్కడ పుట్టారన్న విషయంపై ఇప్పటికే టిటిడితో పాటు గోవిందానంద సరస్వతిలకు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే టిటిడి మాత్రం తిరుమలలోనే ఆంజనేయుడు పుట్టాడంటూ ఏకాంగా తొలి హనుమజ్జయంతి వేడుకలను నిర్వహించేసింది.
 
ఈ వేడుకలను టిటిడి ఈఓ జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు టిటిడి ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల ఆంజనేయస్వామి వారికి నిర్మించిన ఆలయంలో అభిషేకం, తమలపాకులతో పూజ, మల్లెపూలతో అర్చన నిర్వహించారు. 
 
అదేవిధంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామివారికి, మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేక, అర్చన నివేదనలు నిర్వహించారు. కోవిడ్-19 నేపథ్యంలో భక్తులు పెద్దగా వేడుకలకు హాజరుకాలేదు. పరిమిత సంఖ్యలో భక్తులు వేడుకలకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట

తర్వాతి కథనం
Show comments