Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపచారం.. వర్షం పడుతోందన్న నెపంతో గోవిందరాజుని మోహినీ అవతారాన్నే నిలిపేశారు...

Webdunia
బుధవారం, 18 మే 2016 (15:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులో అపచారం చేశారు. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో ఏకంగా గోవిందరాజస్వామి వాహనసేవనే నిలిపేశారు. ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుందోన్న నెపంతో వాహనాన్ని ఊరేగించీ ఊరేగించకుండానే మమ అనిపించేశారు. తితిదే చరిత్రలో మొదటి సారి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లు మాఢా వీధుల్లో ఊరేగింపుకు రాలేదు. 
 
గోవిందరాజుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లు మోహినీ అవతారంలో ఊరేగాల్సి ఉంది. వాహనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా తితిదే చేసింది. అయితే వర్షం పడుతోందని వాహనసేవను నిలిపివేసింది. 
 
ఆలయంలోపలి నుంచి బయటకు వాహనాన్ని తీసుకుని రానే లేదు. ఉత్సవమూర్తులను ఆలయం లోపలే ఉంచేశారు. గతంలో తితిదే ఎన్నోసార్లు వర్షాలు కురిసినా పెద్ద పెద్ద గొడుగులతో వాహనసేవలను కొనసాగిస్తుంది. అయితే ఈ సారి తితిదే అధికారులు తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహన సేవ జరుగకపోతే అపచారమంటూ పలువురు భక్తులు చెప్పుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments