Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకంలో పోటెత్తిన భక్తులు - సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. బొజ్జలగణపయ్య దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల కోసం దేవస్థా

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (10:56 IST)
చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. బొజ్జలగణపయ్య దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల కోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీటితో పాటు ప్రసాదాలను అందిస్తున్నారు. 
 
గంటన్నరలోపే భక్తులకు స్వామిదర్శనం లభిస్తోంది. వినాయకచవితి పర్వదినం కావడంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ రకాల ఫల, పుష్పాలతో అందంగా ముస్తాబు చేశారు. మరోవైపు బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను దేవస్థానం ప్రారంభించనుంది. రేపు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
 
25వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. రోజుకో వాహనంలో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవదాయశాఖ తరపున కాణిపాకం ఆలయానికి పట్టువస్త్రాలను దేవదాయశాఖామంత్రి దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు సమర్పించారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments