Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేలో అంతా మోసమే .. శ్రీవారి నగల కోసం వంటశాలను తవ్వేశారు : రమణ దీక్షతులు

ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో చోటుచేసుకుంటున్న అవినీతి అక్రమాలపై ఆ ఆలయ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు తితిదే ఈవో ఇప్పటికే నో

Webdunia
శనివారం, 19 మే 2018 (12:07 IST)
ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో చోటుచేసుకుంటున్న అవినీతి అక్రమాలపై ఆ ఆలయ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు తితిదే ఈవో ఇప్పటికే నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ.. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు కదా మరికొన్ని అవకతవకలను ఆయన బహిర్గతం చేస్తున్నారు.
 
ఇదే అంశంపై ఆయన తాజాగా మాట్లాడుతూ, గత 2017లో వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన వంటశాలను ఏ ఒక్కరికీ సమాచారం ఇవ్వకుండా మూసివేశారన్నారు. ఈ కారణంగా 25 రోజుల పాటు శ్రీవారికి శుచిగాలేని నైవేద్యాన్ని పెట్టారని ఆయన ఆరోపించారు. ఆలయంలోని వంటశాల వద్ద భూకంపం వచ్చిన మాదిరి అక్కడ గోడలు, ఇటుకలు అన్నీ పడిపోయి ఉన్నాయని, వంటశాలను తవ్వారన్నదానికి ఇది నిదర్శనమన్నారు. పదో శతాబ్దంలో పల్లవులు, చోళులు స్వామివారికి సమర్పించిన ఆభరణాలను భూమి కింద వెతికినట్లు అక్కడి పరిస్థితులు స్పష్టం చేశాయన్నారు. 
 
మరోవైపు, 2001లో గరుడ సేవ సందర్భంగా స్వామివారికి సమర్పించిన ప్లాటినం హారంలో మధ్యన ఉండే గులాబీ రంగు వజ్రం భక్తులు విసిరిన నాణేల వల్ల పగిలిపోయిందని రికార్డు చేశారని, అయితే ఇటీవల జెనీవాలో అలాంటి వజ్రమే రూ.500 కోట్లకు అమ్ముడైందన్నారు. భక్తుల నాణేల తాకిడికి వజ్రం పగిలిపోయిందనడం అబద్ధమన్నారు. టీటీడీలో చోటుచేసుకుంటున్న లోటుపాట్లను బయటపెట్టినందుకు తనపై కక్ష తీర్చుకుంటున్నారని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments