Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై ఉచితంగా అన్న, జల ప్రసాదాలు.. టీ, టిఫిన్, కాఫీ, పాలు కూడా ఫ్రీ..?

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కడుపునిండా భోజనం పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇప్పటిదాకా అన్నప్రసాద సముదాయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లో కాకుండా ఇత

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (17:31 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కడుపునిండా భోజనం పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇప్పటిదాకా అన్నప్రసాద సముదాయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా భోజన సౌకర్యం కల్పిస్తూ వితరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భక్తులు ఆహారం కోసం హోటళ్ల వైపు చూడకుండా.. కదిలే అన్న ప్రసాద వితరణ కేంద్రాలను తితిదే ఏర్పాటు చేసింది.
 
తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 1984లో అన్న ప్రసాద వితరణను తితిదే ప్రారంభించింది. ఆపై కాలక్రమేణా ఈ పథకంలో ఎన్నో మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా వేలాది మందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం కొండపైకి వచ్చే వారందరికీ అన్నపానీయాలు అందించేందుకు చర్యలు ప్రారంభించారు. కానీ తిరుమల కొండపై వచ్చే యాత్రికులందరికీ అన్ని వసతులు ఉచితంగా కల్పించాలనే ఆలోచనతో ఈవో సాంబశివరావు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. 
 
భక్తులకు ఉచితంగా త్రాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ, పిల్లలకు పాలు ఉచితంగా అందజేయాలని సంకల్పించారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకువస్తున్నారు. తొలుత శుద్దమైన త్రాగు నీటిని అందించాలనే ఉద్దేశంతో జలప్రసాదం పేరిట త్రాగునీటి కేంద్రాలను ప్రారంబించారు. అలిపిరి తనిఖీ కేంద్రం మొదలుకుని కొండపైగల అన్ని ప్రదాన ప్రాంతాలలో 15 శుద్దినీటి యంత్రాలను ఏర్పాటు చేశారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments