కొండంత జనం - రోడ్లపైనే అన్నీ ...!

తిరుమల భక్తులతో పోటెత్తింది. ఎక్కడ చూసినా భక్తులే.. భక్తులు. కాస్త జాగా కనిపిస్తే చాలు అక్కడే కూర్చుండిపోతున్నారు భక్తులు. వరుసగా సెలవులు. దాంతో పాటు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.

Webdunia
ఆదివారం, 28 మే 2017 (08:50 IST)
తిరుమల భక్తులతో పోటెత్తింది. ఎక్కడ చూసినా భక్తులే.. భక్తులు. కాస్త జాగా కనిపిస్తే చాలు అక్కడే కూర్చుండిపోతున్నారు భక్తులు. వరుసగా సెలవులు. దాంతో పాటు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కంపార్టుమెంట్లు ఎక్కడికక్కడ నిండిపోయాయి. 3 కిలోమీటర్లకు పైగా క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. దర్శనానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది టిటిడి. అంతేకాదు భక్తులకు వసతి కల్పిస్తామని హామీ ఇవ్వలేని పరిస్థితిల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పటిలాగా టిటిడి చేతులెత్తేసింది. తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. 
 
భక్తులు గంటల తరబడి రోడ్లపైనే బైఠాయిస్తున్నారు. అన్నీ రోడ్లపైనే కానిచ్చేస్తున్నారు. అన్నీ ఫుల్ అంటూ ప్రతి చోటా బోర్డులు దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లలను తీసుకొచ్చిన వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. వృద్ధులను తీసుకొచ్చిన వారి అగచాట్లు చెప్పనవసరం లేదు. కొండంత జనంతో కొండ కిటకిటలాడుతోంది. మరో మూడు, నాలుగురోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం ఉందని టిటిడి అధికారులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం...

భార్య మరొకరితో వెళ్లిపోయిందనీ ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త

గిన్నిస్ గ్లోరీ చారిత్రాత్మక మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ పూర్తి: నవయుగకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రశంస

బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది... 200కు పైగా సీట్లలో గెలుస్తాం : మమతా బెనర్జీ

అండమాన్-నికోబార్ బీచ్‌ నీటి అడుగున జాతీయ జెండా - గిన్నిస్ రికార్డ్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-05-2026 శుక్రవారం ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది

Vaishakh Purnima 2026: వైశాఖ పౌర్ణమి: చంద్రుడు, శ్రీలక్ష్మి పూజతో సర్వం శుభం

01-05-2026 నుంచి 31-05-2026 వరకు మీ మాస ఫలితాలు

30-04-2026 గురువారం ఫలితాలు - గ్రహసంచారం బాగుంది

Sri Narasimha Jayanti: నృసింహ జయంతి: పానకం, వడపప్పు... ఈ మంత్రాలతో పూజిస్తే..?

తర్వాతి కథనం
Show comments