Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడ కనకదుర్గ ఆలయంలో శఠారి ఆశీర్వాదం నిలిపివేత, ఆర్జిత సేవలు కూడా..?

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (18:35 IST)
కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రద్దీ ఉన్న ప్రాంతాల నుంచే ఈ కేసుల సంఖ్య ఎక్కువవడానికి కారణమవుతోంది. మాస్కులను ధరించకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో పాటు శానిటైజర్లను వాడకపోవడంతో కరోనా బారిన చాలామంది పడుతున్నారు. దీంతో దేవదాయశాఖ అప్రమత్తమైంది. ఆలయాల వద్ద ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి కొన్ని ఆలయాల్లో నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది.

 
ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలను విధించారు. ఆలయంలోని దుర్గమ్మ అంతరాలయ దర్సనంతో పాటు శఠారిని పూర్తిగా నిలిపివేశారు. అన్ని ఆర్జిత సేవలకు 50 శాతం మాత్రమే భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.

 
ఆలయంలో ఉచిత ప్రసాదాల పంపిణీ నిలుపుదల చేశారు. దుర్గమ్మ దర్సనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. మాస్కులు లేని భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు.

 
ఇంద్రకీలాద్రిపై తక్కువ మొత్తంలోనే ప్రసాద విక్రయాలు నిర్వహిస్తున్నారని ఈఓ భ్రమరాంభ స్పష్టం చేశారు. అంతే కాకుండా కోవిడ్ ఉదృతి నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేస్తున్నామని.. భక్తులు ఇందుకు సహకరించాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

తర్వాతి కథనం
Show comments