Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్నకు కోటి రూపాయల విలువైన స్వర్ణ కిరీటం!

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (11:25 IST)
తిరుపతి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కోటి రూపాయల విలువైన స్వర్ణ కిరీటం కానుకగా అందింది. వెంకన్నకు కోయంబత్తూర్‌కు చెందిన బాలమురగన్ అపర్ణ అనే భక్తుడు రూ.కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించాడు. ముందుగా దానికి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణను కలసి కిరీటాన్ని అందజేశారు. అనంతరం భక్తుడికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 
ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ విషయాన్ని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. ఆరు రోజుల్లో స్వామివారి సేవలో 5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
 
నగరంలో ప్రతి ఏటా వైభవోత్సవాలను నిర్వహించేందుకు హర్ష టయోటా సంస్థ యాజమాన్యం ముందుకొచ్చిందని చెప్పారు. ముఖ్యంగా శుక్రవారం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలోనే హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

Show comments