Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మానుష్యంగా శ్రీవారి మాడవీధులు.. రాత్రివేళల్లో క్రూరమృగాల సంచారం?!

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (07:32 IST)
నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ సందడిగా ఉండే తిరుమల గిరులు ఇపుడు బోసిబోయికనిపిస్తున్నాయి. భక్తులు లేక ఏడుకొండలు వెలవెలబోతున్నాయి. పైగా, రాత్రి సమయాల్లో క్రూరమృగాలు సంచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల రాకను తితిదే పాలక మండలి నిలిపివేస్తూ సంచలాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఏడుకొండలు బోసిబోయి కనిపిస్తున్నాయి. పైగా, శ్రీవారి నిలయం ఇలా నిర్మానుష్కంగా కనిపించడం గత 128 యేళ్ళలో ఇదే తొలిసారి అని చరిత్రపుటలు చెబుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కరోనా భయం కారణంగా భక్తుల రాకను అడ్డుకోవడంతో కొన్నిరోజులుగా తిరుమల క్షేత్రం బోసిపోయినట్టు కనిపిస్తోంది. నిత్యం భక్తజనసందోహంతో కోలాహలంగా ఉండే మాడవీధులు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న తిరుమల వీధుల్లో క్రూరమృగాలు సంచరిస్తున్నాయి. 
 
రాత్రివేళల్లో కల్యాణవేదిక, నారాయణగిరి, ముల్లగుంట ప్రాంతాల్లో చిరుతపులులు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు గుర్తించారు. జంతువుల సంచారంతో విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల కొండపై ఉన్న స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎవరూ బయట తిరగవొద్దని అధికారులు విజ్ఞప్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

16-03-2025 ఆదివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

దురదృష్టం పరుగెడుతున్నా పట్టుకునేది ఇలాంటివారే

తర్వాతి కథనం
Show comments