Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మానుష్యంగా శ్రీవారి మాడవీధులు.. రాత్రివేళల్లో క్రూరమృగాల సంచారం?!

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (07:32 IST)
నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ సందడిగా ఉండే తిరుమల గిరులు ఇపుడు బోసిబోయికనిపిస్తున్నాయి. భక్తులు లేక ఏడుకొండలు వెలవెలబోతున్నాయి. పైగా, రాత్రి సమయాల్లో క్రూరమృగాలు సంచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల రాకను తితిదే పాలక మండలి నిలిపివేస్తూ సంచలాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఏడుకొండలు బోసిబోయి కనిపిస్తున్నాయి. పైగా, శ్రీవారి నిలయం ఇలా నిర్మానుష్కంగా కనిపించడం గత 128 యేళ్ళలో ఇదే తొలిసారి అని చరిత్రపుటలు చెబుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కరోనా భయం కారణంగా భక్తుల రాకను అడ్డుకోవడంతో కొన్నిరోజులుగా తిరుమల క్షేత్రం బోసిపోయినట్టు కనిపిస్తోంది. నిత్యం భక్తజనసందోహంతో కోలాహలంగా ఉండే మాడవీధులు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న తిరుమల వీధుల్లో క్రూరమృగాలు సంచరిస్తున్నాయి. 
 
రాత్రివేళల్లో కల్యాణవేదిక, నారాయణగిరి, ముల్లగుంట ప్రాంతాల్లో చిరుతపులులు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు గుర్తించారు. జంతువుల సంచారంతో విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల కొండపై ఉన్న స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎవరూ బయట తిరగవొద్దని అధికారులు విజ్ఞప్తిచేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments