Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి సేవలో చిరంజీవి... చూసేందుకు ఎగబడిన భక్తులు... గంటలో శ్రీవారి దర్శనం

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2016 (10:52 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సోమవారం పలువురు వీఐపీలు దర్శనం చేసుకున్నారు. వీరిలో రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి కూడా ఉన్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో చిరంజీవి తన కుటుంబ సమేతంగా స్వామిసేవలో పాల్గొన్నారు. 
 
ఇటీవల వివాహమైన తన చిన్న కుమార్తె శ్రీజ వివాహం తర్వాత మొదటిసారి స్వామి వారిని చిరంజీవి దర్శించుకున్నారు. అలాగే పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత, ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీ రావులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, చిరంజీవిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. 
 
మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనం గంటలోనే భక్తులకు లభిస్తోంది. తిరుమల మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. వీఐపీలు మినహా తిరుమలలో సామాన్య భక్తులు తక్కువగా కనిపిస్తున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో వేచి ఉన్నారు. సర్వదర్శనంతోపాటు కాలినడక భక్తులకు గంటలోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. ఆదివారం శ్రీవారిని 79,646 మంది భక్తులు దర్శించుకోగా, ఆలయ హుండీ ఆదాయం రూ.2.48 కోట్లుగా వసూలైంది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments