Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తోంది.. తుది ప్రకటన త్వరలోనే: ఉమాభారతి

యమునానగర్ విలేజ్లోని భూగర్భంలో నీటి ప్రవాహాలు.. సరస్వతీ నదే!

Webdunia
బుధవారం, 2 మార్చి 2016 (14:33 IST)
సరస్వతీ నది భూగర్భంలో ఉన్నట్లు గుర్తించామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. భారతీయ పురాణాల్లో, ఇతిహాసాల్లో ప్రముఖంగా పేర్కొన్న సరస్వతీ నది ఆచూకీని గుర్తించామని ఆమె పేర్కొన్నారు. అప్పటి సరస్వతి నది ప్రవహించినట్లు భావిస్తున్న మార్గంలో.. ప్రస్తుతం భూగర్భంలో ఒక నది ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 
 
దీనిపైన టాస్క్‌ఫోర్స్‌ తదుపరి అధ్యయనం చేస్తోందని.. నివేదిక వచ్చిన తర్వాత సరస్వతీ నదిపై తుదిప్రకటన చేస్తామన్నారు. గంగ-యమున-సరస్వతి నదులు ప్రవహిస్తున్నాయని రికార్డుల పరంగా పేర్కొంటున్నప్పటికీ సరస్వతి నది ఎప్పుడో అంతర్థానమైపోయింది. ఇస్రో సహకారంతో ఉపగ్రహాల ద్వారా కూడా అన్వేషణ ప్రారంభినట్లు ఉమాభారతి వ్యాఖ్యానించారు. 
 
టాస్క్ ఫోర్స్ హర్యానా - రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రవహించినట్లు తెలుస్తోందని.. యుమునానగర్ విలేజ్‌లోని భూగర్భంలో నీటి ప్రవాహాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఉమా భారతి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమా భారతి తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments