Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో అపూర్వ ఘట్టం - వకుళామాత ఆలయానికి భూమి పూజ

450 సంవత్సరాల పోరాటం. అన్యాయంపై న్యాయం విజయం. హిందూ ధార్మిక సంఘాలు ఐక్యమై ఎట్టకేలకు వకుళామాత ఆలయానికి భూమి పూజ చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో వకుళామాత ఆలయ నిర్మాణం చేసుకోమని తీర్పు వచ్చిన తర్వాత హింద

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (12:51 IST)
450 సంవత్సరాల పోరాటం. అన్యాయంపై న్యాయం విజయం. హిందూ ధార్మిక సంఘాలు ఐక్యమై ఎట్టకేలకు వకుళామాత ఆలయానికి భూమి పూజ చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో వకుళామాత ఆలయ నిర్మాణం చేసుకోమని తీర్పు వచ్చిన తర్వాత హిందూ ధార్మికవేత్తలు పండుగ చేసుకున్నారు. 
 
తిరుపతి రూరల్‌లోని వకుళామాత ఆలయానికి భూమి పూజ పూర్తయ్యింది. 450 సంవత్సరాల పోరాటం తరువాత ఎట్టకేలకు ఆలయ నిర్మాణానికి శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి శ్రీకారం చుట్టారు. దేశం నలుమూలల నుంచి 9 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు భూమి పూజలకు హాజరయ్యారు. అలాగే దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
సాక్షాత్తు తిరుమల వెంకన్న తల్లి వకుళామాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం ఎంతో సంతోషంగా ఉందని దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు అన్నారు. త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తవుతుందని పరిపూర్ణానందస్వామి ధీమా వ్యక్తం చేశారు. వకుళామాత ఆలయ నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరించడానికి టిటిడి సిద్ధంగా ఉందన్నారు తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. ఈ వేడుకతో పేరూరులో ఒక పండుగ వాతావరణం కనిపించింది.  

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments