జూన్‌ 15 నుంచి అప్పలాయగుంట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (15:22 IST)
తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూన్‌ 15వతేదీ నుంచి 23వతేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఆలయంలో సమావేశమైన జెఈఓ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
 
జెఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్‌ 7వతేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్‌ 14వతేదీన అంకురార్పణ, జూన్‌ 15వతేదీన ధ్వజారోహణం, జూన్‌ 19వతేదీన గరుడసేవ, జూన్‌ 22వతేదీన రథోత్సవం, జూన్‌ 23వతేదీన చక్రస్నానంతను తితిదే నిర్వహించనుంది. అలాగే జూన్‌ 18వతేదీన కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహించనుంది. గరుడ వాహనం రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసుల హారాన్ని వూరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అలంకరించి ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య - సీఎం చంద్రబాబు ఫోనులో పరామర్శ

ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని

నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

ఆ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను తిరిగి పునరుద్ధరించిన రైల్వే శాఖ

అన్నీ చూడండి

లేటెస్ట్

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

తర్వాతి కథనం
Show comments