Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Webdunia
ఆదివారం, 15 మే 2016 (12:40 IST)
తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బోస్లే శనివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో స్వామి సేవలో కుటుంబ సమేతంగా ఆయన పాల్గొన్నారు. 
 
ఆలయంలోని రంగనాయకమండపంతో తితిదే అధికారులు సీజే కుటుంబానికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. 
 
మరోవైపు.. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని తితిదే నిర్వహించింది. 
 
మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనుండంతో తితిదే శుద్ధి కోసం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజాన్ని నిర్వహించింది. ఆలయాన్ని తితిదే సిబ్బంది శుద్ధి చేశారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని తితిదే నిర్వహిస్తూ వస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

29-06-2025 నుంచి 01-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

28-06-2025 శనివారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

తర్వాతి కథనం
Show comments