Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Webdunia
ఆదివారం, 15 మే 2016 (12:40 IST)
తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బోస్లే శనివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో స్వామి సేవలో కుటుంబ సమేతంగా ఆయన పాల్గొన్నారు. 
 
ఆలయంలోని రంగనాయకమండపంతో తితిదే అధికారులు సీజే కుటుంబానికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. 
 
మరోవైపు.. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని తితిదే నిర్వహించింది. 
 
మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనుండంతో తితిదే శుద్ధి కోసం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజాన్ని నిర్వహించింది. ఆలయాన్ని తితిదే సిబ్బంది శుద్ధి చేశారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని తితిదే నిర్వహిస్తూ వస్తోంది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments