Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందా.. గోవిందా : సర్వదర్శనానికి ఆధార్‌

ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు గుర్తింపుకోసం అన్నిటా ఆధార్‌ను తప్పని సరిచేసింది ప్రభుత్వం. ఇప్పుడు శ్రీవారి దర్శించుకునేందుకు కూడా ఆధార్ తప్పదంటోంది టీటీడీ. ఈ విధానం వల్ల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (09:08 IST)
ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు గుర్తింపుకోసం అన్నిటా ఆధార్‌ను తప్పని సరిచేసింది ప్రభుత్వం. ఇప్పుడు శ్రీవారి దర్శించుకునేందుకు కూడా ఆధార్ తప్పదంటోంది టీటీడీ. ఈ విధానం వల్ల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్న సామాన్య భక్తుల కష్టాలు తీరనున్నాయి. 
 
సర్వదర్శనానికీ స్లాట్‌ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు తితిదే అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిత్యం 22 వేల నుంచి 38 వేల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇందుకోసం తిరుమలలో 21 ప్రాంతాలలో 150 కౌంటర్లు ద్వారా టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేపట్టారు. టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డును తితిదే అధికారులు తప్పనిసరి చేశారు. ఒక్కసారి టోకెన్ పొందిన భక్తుడికి మరో 48 గంటల వరకు టోకెన్ పొందే అవకాశం ఉండదు. ఫిబ్రవరి నుంచి కొత్త విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

తర్వాతి కథనం
Show comments