Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజులతో కనకదుర్గ అమ్మవారికి అలంకరణ...

బెజవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మంగళ వారం రోజున కనకదుర్గ అమ్మవారిని అత్యంత ప్రసన్నమూర్తిగా గాజులతో అలంకరించారు. అమ్మవారి మూలవిరాట్టుతో పాటు అంతరాలయాన్ని సైతం గాజులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవం కోసం భక్తుల నుంచి 4 లక్షలకు

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (20:41 IST)
బెజవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మంగళ వారం రోజున కనకదుర్గ అమ్మవారిని అత్యంత ప్రసన్నమూర్తిగా గాజులతో అలంకరించారు. అమ్మవారి మూలవిరాట్టుతో పాటు అంతరాలయాన్ని సైతం గాజులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవం కోసం భక్తుల నుంచి 4 లక్షలకు పైగా గాజులు వచ్చాయి. మరో లక్ష గాజులు ఆలయ అధికారులు కొనుగోలు చేసి అలంకరణకు ఉపయోగించారు. ప్రధాన ఆలయంతో పాటు మహా మండపంలోని ఉత్సవ మూర్తికి ఈ గాజులతో అలంకారం చేసారు. 
 
ఎక్కువ గాజులను ఇక్కడే ఉపయోగించారు. గాజులోత్సవం వేడుకను చూడాలంటే ఉత్సవమూర్తిని దర్శించుకోవాల్సిందే. దుర్గమ్మను ఇలా అలంకరించి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం ఇక్కడ భక్తుల్లో ఆనందాన్ని నింపుతోంది. తొలిసారిగా  అమ్మవారికి గాజులతో ప్రత్యేకంగా అలంకరించటం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
అమ్మవారిని దసరా వేడుకల్లోనే కాకుండా ఇలాంటి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించటం ఆలయ వైభవాన్ని మరింతగా పెంచటమేనని చెబుతున్నారు. గాజుల అలంకారంలో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

తర్వాతి కథనం
Show comments