Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపంగి ప్రాకారంలోనే తిరుమలేశుని సేవలు

Webdunia
FILE
కలియుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ఇకపై వారపు సేవలు సంపంగి ప్రాకారంలో జరుగనున్నాయి.

తిరుమల ఆలయంలో బంగారు వాకిలి వెలుపల గరుడాళ్వార్ సన్నిధి వద్ద సాగే వారపు సేవలను ఇకపై సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మంటపంలో నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.

ప్రతి మంగళ, బుధ, గురువారాల్లో అష్టదళ పాద పద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవలను ఆలయంలోని బంగారు వాకిలి వద్ద నిర్వహించడం ఆనవాయితీ. దీనివల్ల స్వామివారి దర్శనం దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోతుంది. దీంతో భక్తుల రద్దీ పెరిగి పోతుంది.

భక్తుల సౌకర్యార్థం సందర్శన సమయాన్ని పెంచేందుకు ఈ మూడు సేవలను సంపంగి ప్రాకారంలోనే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇది త్వరలోనే అమలులోకి వస్తుందని టీటీడీ అధికారులు అంటున్నారు.

ఇదిలా ఉండగా.. వెంకన్న స్వామికి కానుకలు వెల్లువల్లా వస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన సుందర్శనరావు అనే భక్తుడు రూ. 29వేల విలువైన పది చక్రాల కుర్చీలను కానుకగా సమర్పించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments