Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా శ్రీవారికి పవిత్ర మాలల సమర్పణ

Webdunia
FILE
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం పవిత్రమాలల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

ఉదయం ఆలయంలో యధావిధిగా ప్రభాత సేవలు పూర్తయిన అనంతరం ఉత్సవర్లను మండపానికి వేంచేపు చేశారు. ప్రత్యేక స్నపన తిరుమంజనం తర్వాత, తొలిరోజు ప్రతిష్టించిన పట్టుపవిత్ర మాలలను వెండి పళ్లాలలో ఉంచి మూలవర్లకు సమర్పించారు.

శాస్త్రోక్త కార్యక్రమాల అనంతరం స్వామివారికి కిరీటం, శంఖచక్రాలు, లక్ష్మీదేవీకి కటి, వరద హస్తాలు, పాదపద్మాలకు పవిత్ర మాలలను సమర్పించారు.

ఇలా పరివార దేవతలైన భోగ, ఉగ్ర, కొలువు శ్రీనివాసమూర్తులతో పాటు సీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు తదితర ఉత్సవమూర్తులకు పవిత్రమాలలను సమర్పించే కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పవిత్రమాలల సమర్పణకు అనంతరం పవిత్రోత్సవ మండపంలో ఉభయనాంచారి సమేత మలయప్ప స్వామికి కళశాలకు, యజ్ఞగుండాలకు పవిత్రాన్ని అలంకరించి ధూపదీప నైవేద్యాది హారతులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

సాయంత్రం సర్వాలంకరణాభూషితుడైన శ్రీ వెంకన్న స్వామి తిరుమాడవీధుల్లో ఊరేగుతూ.. భక్తులకు దర్శనమిచ్చారు. ఇకపోతే.. మూడోరోజైన సోమవారం గృహస్థులకు బహుమానం అందజేయడం, మధ్యాహ్నం ఒంటి గంటకు విశేష సమర్పణ, సాయంత్రం నాలుగు గంటలకు మాడవీధుల్లో శ్రీవారి ఊరేగింపు, పూర్ణాహుతి, ఆరు గంటలకు హోమం, యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments