Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో వైభవంగా జరిగిన శ్రీవారి పవిత్రోత్సవాలు

Webdunia
FILE
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రతువుకు సోమవారం వసంత మంటపంలో అంకురార్పణ జరిగింది. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలకు అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని పల్లకిపై పవిత్రోత్సవ మంటపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు.

పవిత్రాలను (పట్టుదండాలు) యాగశాలలో ప్రతిష్టించారు. తదనంతరం వేద పండితులు వైఖానస ఆగమోక్తంగా హోమాలు, అభిషేకాది పూజలు నిర్వహించారు. సాయంత్రం సర్వాలంకార శోభితుడైన స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. ఈ ఊరేగింపులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సర్వాలంకరణా భూషితుడైన గోవిందుని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments