ఫోన్‌లో భక్తి.. సెల్‌లో వినాయక ముక్తి

Webdunia
WD PhotoWD
దేవుడు సైతం మొబైల్ ఉపయోగిస్తున్నాడంటే మీరు నమ్మగలరా.. ఆశ్చర్యమేస్తుంది కదూ.. మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే 1200 సంవత్సరాల నాటి ఆలయానికి మిమ్ములను తీసుకెళతాం. ఇక్కడే వినాయకుడు మొబైల్‌ ఫోన్‌తో తన భక్తులను సంప్రదిస్తుంటాడు.

ఈ కాలంలో ప్రజలు ఎక్కడ చూసినా ఒత్తిళ్ల మధ్యనే బతుకుతున్నారు. కనీసం గుడికి వెళ్లేందుకు కూడా వీరికి తీరిక దొరకడం లేదు. అయితే ఇకనుంచి జనం భయపడవలసింది లేదు. ఎందుకంటే ఇండోర్‌లో జునా చింతామన్ గణేష్ భక్తుల వేడుకోళ్లను మొబైల్ ఫోన్‌లో విని వారి కోరికలు తీరుస్తుంటాడు.

జునా చింతామన్ గణేశ ఆలయానికి 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయ పూజారి చెప్పినదాని ప్రకారం, గత 22 ఏళ్లుగా భక్తులు ఈ ఆలయానికి లెక్కలేనన్ని ఉత్తరాలు పంపుతున్నారట. వీటిలో కొన్ని వేడుకోలు రూపంలో ఉంటే మరి కొన్ని కృతజ్ఞతలు తెలిపే ఉత్తరాలు.

అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్లు ప్రజల అభిమానం పొందాయి కనుక ఇక్కడి వినాయకుడికి ఉత్తరాలతో పాటు ఫోన్‌కాల్స్ కూడా వస్తున్నాయట. ఎవరైనా భక్తుడు కాల్ చేసినట్లయితే, ఆలయ పూజారి మొబైల్ ఫోన్‌ని వినాయకుడి చెవులకు సమీపంలో ఉంచుతారు. అప్పుడు భక్తులు తమ సమస్యలు, కోరుకునే పరిష్కారాల గురించి దేవుడికి విన్నవించుకుంటారు.

WD PhotoWD
ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ సమస్యలను జునా చింతామణ్ గణేష్ నిజంగా మొబైల్ ఫోన్ ద్వారా వింటున్నాడని విశ్వసిస్తుంటారు. పైగా ఉత్తరాల రూపంలో లేదా ఫోన్ ద్వారా భక్తులు చేసే విన్నపాలను దేవుడు నెరవేరుస్తుంటాడు కూడా. ఇలా తమ కోరికలను నెరవేర్చినందుకు గాను మనీష్ మోడీ ఈ ఆలయంలోని వినాయకుడికి కృతజ్ఞతలు తెలిపాడు కూడా.

ఇక్కడి గణేషునికి భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ కాల్స్ కూడా వస్తుంటాయి. ఒకటి కంటే మించి ఎక్కువ కోరికలున్న భక్తులు వాటిని ఉత్తరాల రూపంలో పంపుతుంటారు. ఇలా ఉత్తరాల ద్వారా, మొబైల్ కాల్స్ ద్వారా వినాయకుడు తమ కోరికలను విని వాటిని నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం.

వినాయకుడు మొబైల్ ఫోన్ మరియు ఉత్తరాల ద్వారా తన భక్తులందరి కోరికలను వింటూ ఉంటాడన్న విషయాన్ని మీరు నమ్ముతారా.. లేదంటే ప్రజలను ఆకట్టుకోవడానికి ఇది ఒక వాహకంలాగా ఉపయోగపడుతోందని భావిస్తున్నారా... ఈ ఉదంతంపై మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కథనంపై దయచేసి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

Kartik Purnima: కార్తీక పూర్ణిమ.. శివకేశవులను పూజిస్తే సర్వం శుభం.. నేతి దీపాన్ని?

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

04-11-2025 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

నాకంటే పెద్దావిడ నాకు పాద నమస్కారం చేసింది, అలా చేయవచ్చా? పెద్దవారికి కదా చేసేది...

karthika masam, దీపం జ్యోతిః పరబ్రహ్మః, కళ్ళతో దీపం జ్వాలను ఏకాగ్రతతో చూస్తే?

Show comments