శ్రీకాళహస్తి ఆలయ దర్శనం తరువాత వేరే ఆలయానికి ఎందుకు వెళ్ళకూడదు?

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (21:00 IST)
పంచ భూతాల నిలయం ఈ విశాల విశ్వం. భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని. ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలో వెలసిన వాయులింగం. అందుకే ఇక్కడ గాలిని స్మరించిన తరువాత ఇతర ఏ దేవాలయాలకు వెళ్ళకూడదని ఆచారం ఉంది.
 
సర్పదోష, రాహుకేతు పూజలు చేయించుకుంటే సమస్యలు తీరిపోతాయి. శ్రీకాళహస్తిలోని సుబ్రహణ్యస్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది. ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తిలో చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే వెళ్ళాలని చెబుతుంటారు పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఈ దేవాలయానికి వెళ్ళినా ఆ దోషనివారణ జరగదని పూజారులు చెబుతుంటారు. 
 
గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని, మిగిలిన అన్ని దేవుళ్ళకు శని, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతారు. దీనికి మరో ఆధారం చంద్రగ్రహణం. తిరుమలలో సహా అన్ని దేవాలయాలను గ్రహణ సమయంలో మూసేస్తారు. గ్రహణం తరువాత సంప్రోక్షణ జరిపి ఆ తరువాత ఆలయాలను తెరుస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం మూసివేయరు. అందుకే శ్రీకాళహస్తి ఆలయ దర్శనం తరువాత వేరే ఇతర ఏ ఆలయాలకు వెళ్ళకూడదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

వైకాపా నేత, ఏయూ మాజీ వీసీ ప్రసాద రెడ్డికి జైలుశిక్ష

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Godess Lakshmi : మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..?

04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

జై గురుదత్త

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

తర్వాతి కథనం
Show comments