పిడుగులు పడుతుంటే అర్జునా.. ఫల్గుణా అని ఎందుకంటారు?

Webdunia
గురువారం, 18 జులై 2019 (21:28 IST)
పిడుగులు పడినప్పుడు పెద్దలు అర్జునా, ఫల్గుణా అని అంటారు. దాని వెనుక ఉన్ని పరమార్దం ఏమిటి? ఈ విషయం వెనుక మహాభారత గాధ ఉంది. అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం దగ్గరకు తీసుకువస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్ని తరలించుకుపోతున్న దుర్యోధన, కర్ణాదులను ఎదుర్కోవడానికి ఆయుధాలను చెట్టు మీద నుండి దించమంటాడు. 
 
ఉత్తర కుమారుడు భయపడుతుంటే... అది చూసి అర్జునుడు, తనకు ఉన్న పది పేర్లు(అర్జునా, ఫల్గుణా, పార్ధ, కిరీటీ, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ) చెప్పి , భయాన్ని పోగొడతాడు. అప్పటి నుండి ఎలాంటి భయం కలిగినా అర్జునా, ఫల్గుణా..... అని తలుచుకోవడం మొదలయ్యింది. అయితే యుద్ధంలో అర్జునుడి రధ చక్ర శూల విరిగిపడిందని, అదే పిడుగు అయ్యిందని నమ్మకం ఉండటంతో, పిడుగు పడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లు తలుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

36 రోజులుగా ఇంటర్‌నెట్ లేదు, మరో 48 గంటల్లో బీభత్సం: ఇరాన్ ఏమవుతుంది?!!

మంగళవారం ఇరాన్‌లో మరణమృదంగం వినిపిస్తా, రానున్న 48 గంటల్లో బీభత్సం: ట్రంప్ వార్నింగ్

ఆటో సీటు కవర్ చింపేశాడని.. ఏడేళ్ల కుమారుడికి వాతపెట్టిన సైకో తండ్రి

అక్రమ సంబంధం: భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.. పెట్రోల్ పోసి, గోధుమ గడ్డి కప్పి?

ఫస్ట్ నైట్ రోజున భార్యకు మత్తు మందు ఇచ్చి నలుగురు స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

02-04-2026 గురువారం ఫలితాలు-విశేషమైన కార్యసిద్ధి ఉంది

ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీకి ఎంపికైన పూజ్యశ్రీ శివకృపానంద్ స్వామిజీ

01-04-2026 బుధవారం ఫలితాలు - ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు

01-04-2026 నుంచి 30-04- 2026 వరకు మాస ఫలితాలు- సత్కాలం సమీపిస్తుంది..

31-03-2026 మంగళవారం ఫలితాలు - తప్పులు దొర్లే ఆస్కారం ఉంది..

తర్వాతి కథనం
Show comments