Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి.. డిసెంబర్ 27న ఆళ్వార్ తిరుమంజనం

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (13:53 IST)
జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని ఆళ్వార్ తిరుమంజన సేవ జరుగనుంది. సాధారణంగా సంక్రాంతి, దీపావళి ఆస్థానం, బ్రహ్మోత్సవాల సమయంలో ఆళ్వార్ తిరుమంజన సేవ జరుగుతుంది. 
 
అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 27న ఆలయాన్ని శుద్ధి చేసే ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగబోతోంది. ప్రతిగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మూలవిరాట్టుకు పట్టువస్త్రం కప్పుతారు. గర్భగుడి, ఆనంద నిలయం, ధ్వజ స్తంభం, యోగ నరసింహ స్వామి, వకుళమాత వంటి పుణ్యక్షేత్రాలు, సంపంగి మండపం, రంగనాథ మండపాలతో పాటు ఆలయ శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పచ్చకర్పూరం, పసుపు వంటి వివిధ మూలికా పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయం అంతటా చల్లడం చేస్తారు. 
 
ఆలయంలో ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా దర్శనానికి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. దీంతో 5 గంటల పాటు దర్శనం నిలిచిపోనుంది. కాగా గురువారం 63,145 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 22,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 11 అలంకార గొడుగులు.. శోభాయాత్ర ప్రారంభం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంకురార్పణంతో ప్రారంభం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. 4 నుంచి 12 వరకు...

03-10-2024 గురువారం దినఫలితాలు : ఉద్యోగస్తులు ఏకాగ్రత వహించాలి...

01-10-2024 నుంచి 31-10-2024 వరకు మీ మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments