Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి.. డిసెంబర్ 27న ఆళ్వార్ తిరుమంజనం

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (13:53 IST)
జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని ఆళ్వార్ తిరుమంజన సేవ జరుగనుంది. సాధారణంగా సంక్రాంతి, దీపావళి ఆస్థానం, బ్రహ్మోత్సవాల సమయంలో ఆళ్వార్ తిరుమంజన సేవ జరుగుతుంది. 
 
అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 27న ఆలయాన్ని శుద్ధి చేసే ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగబోతోంది. ప్రతిగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మూలవిరాట్టుకు పట్టువస్త్రం కప్పుతారు. గర్భగుడి, ఆనంద నిలయం, ధ్వజ స్తంభం, యోగ నరసింహ స్వామి, వకుళమాత వంటి పుణ్యక్షేత్రాలు, సంపంగి మండపం, రంగనాథ మండపాలతో పాటు ఆలయ శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పచ్చకర్పూరం, పసుపు వంటి వివిధ మూలికా పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయం అంతటా చల్లడం చేస్తారు. 
 
ఆలయంలో ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా దర్శనానికి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. దీంతో 5 గంటల పాటు దర్శనం నిలిచిపోనుంది. కాగా గురువారం 63,145 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 22,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

లేటెస్ట్

18-07-2025 శుక్రవారం దినఫలితాలు - మనోధైర్యంతో లక్ష్యసాధనకు కృషి చేయండి...

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

తర్వాతి కథనం
Show comments